సెన్సెక్స్ 2300 పాయింట్లు డౌన్‌..

స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా కుప్ప‌కూలాయి.  క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు.. ట్రేడింగ్ వెల‌వెల‌బోయింది.  సెన్సెక్స్ ఇవాళ 2300 పాయింట్లు కోల్పోయింది.  నిఫ్టీ కూడా 9300 పాయింట్లు డౌన‌య్యింది. సెన్సెక్స్‌, నిఫ్టీలు ఏడు శాతం త‌క్కువ‌గా ట్రేడ‌య్యాయి.   సుమారు 2400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌.. 31,663 పాయింట్ల వ‌ద్ద ట్రేడింగ్ నిర్వ‌హించింది.  క‌రోనా భ‌యం ట్రేడింగ్ వ్య‌వ‌హారాల‌ను నిర్వీర్యం చేస్తున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.